విధాత: భారత్ ఆర్ధికంగా.. శక్తివంతంగా నిలవడానికి పీవీ నర్సింహారావు కారణం అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి, మాజీ ఏఐసీసీ అధ్యక్షుడు పీవీ నర్సింహారావ్ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ లోని పీవీ ఘాట్ వద్ద టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, హర్కర వేణుగోపాల్, అనిల్ యాదవ్, రోహిన్ రెడ్డి తదితరులు పీవీ ఘాట్ వద్ద పూల మాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. భూ సంస్కరణలు తెచ్చి.. భూమి లేని పేదలకు భూమి ఇచ్చారని తెలిపారు. ప్రపంచ దేశాలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందడానికి పీవీ సరళీకృత విధానాలే కారణమన్నారు. పీవీని ప్రతి ఒక్కరూ కీర్తించాల్సిన వ్యక్తి అని చెప్పారు.
మారుమూల గ్రామం నుంచి దేశ ప్రధానిగా ఎదగడంలో ఆయన సేవలు మరవలేనివి, దివంగత జైపాల్ రెడ్డి.. పీవీ అడుగుల్లో నడిచారు అని చెప్పారు. తెలంగాణ అభ్యున్నతికి కాంగ్రెస్ పాటు పడుతుందన్నారు. వంగర గ్రామంలో పీవీ జ్ఞాపకార్దం చేపట్టిన పనులు అసంపూర్తిగా జరిగాయని, వాటిని త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.